మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా నిర్వాసితులుగా మారుతున్న నార్సింగి మధు పార్కు రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు రకాలుగా వారికి ఫ్యాకేజీ ఆఫర్ చేస్తున్నట్లు తెలిసింది. భారీ మెుత్తంలో డబ్బులు లేదా గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు ఇవ్వాలని భావిస్తున్నారట.