హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్న్యూస్. టికెట్ ధరలను పెంచుతూ ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు మే 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది. తాజా నిర్ణయం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న కనిష్ఠ ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కు పెరిగాయి. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతోనే ఈ ఛార్జీల పెంపు అనివార్యమైనట్లు తెలుస్తోంది.