తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల నుంచి నాలుగున్నరేళ్లకే సంవత్సరాల కాలానికి మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఐదేళ్లకు పూర్తి ఫీజులు వసూలు చేసిన కాలేజీలు ఆ అదనపు మొత్తాన్ని విద్యార్థులకు వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు చేసిన సుదీర్ఘ న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించి ఈ ఉత్తర్వులు వచ్చాయి. . దీనివల్ల ప్రతి విద్యార్థికి లక్షలాది రూపాయల అదనపు భారం తగ్గి భారీ ఊరట లభించింది.