మెహిదీపట్నం రైతుబజార్ వద్ద నిర్మిస్తున్న స్కైవాక్ ఎత్తు తక్కువగా ఉండటంతో భారీ వాహనాలు ఇరుక్కుపోయి గడ్డర్లు దెబ్బతింటున్నాయి. ప్రణాళికా లోపంపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. హెచ్ఎండీఏ పనులను వేగవంతం చేసింది. సుమారు 33 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ ఆకాశ మార్గం వచ్చే నెల నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.