తెలంగాణ రైతులకు గుడ్న్యూస్. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రాన్ని తాకనున్నాయి. అనుకున్న దానికంటే ముందే రుతుపవనాలు వస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తాయని.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.