ktr uk visit invites investments in telangana: యూకే పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వార్విక్ యూనివర్సిటీలో పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించారు. అధికారంలో ఉన్నా లేకున్నా, తెలంగాణాభివృద్ధికి కట్టుబడి ఉంటామని.. ఇండియా ఫస్ట్.. తెలంగాణ ఫస్ట్ అనే విధానం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆటోమోటివ్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరిస్తూ, పెట్టుబడులను ఆకర్షించి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ కొత్త చిరునామాగా మారిందని, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.