Medaram Maha Jatara 2026: మేడారం మహాజాతర మొదలైన తొలిరోజే కోళ్లకు వైరస్ సోకి వేల సంఖ్యలో మృత్యువాత పడటం వ్యాపారులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. అమ్మవారికి మొక్కుల చెల్లింపులో భాగంగా కోళ్లు, మేకల బలితో పాటు వాటి ధరలు కూడా అమాంతం పెరిగాయి. ఈ వైరస్ దెబ్బతో వ్యాపారులు నష్టపోతుండగా, భక్తులు భయపడుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే మేడారంలో కోళ్లు, మేకలు, చికెన్, మటన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.