మేడారం జాతరలో విషాదం.. జంపన్న వాగులో పడి భక్తుడు మృతి..

6 months ago 43
మేడారం మహాజాతర ప్రారంభం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో జాతరలో విషాదం చోటుచేసుకుంది. జంపన్నవాగులో పడి ఒక భక్తుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అతడిని మంచిర్యాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అంతకుముందు, మేడారం జాతరకు వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 18 మంది గాయపడ్డారు. వారిని మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, జాతరలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article