తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ప్రాంగణాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం సమ్మక్క, సారలమ్మ గద్దెల స్థానాల్లో మార్పులు చేసి, క్యూలైన్లను క్రమబద్ధీకరించనున్నారు. ట్రైబల్ డిజైన్స్ సంస్థ రూపొందించిన నూతన మాస్టర్ప్లాన్కు ఆమోదం లభించడంతో.. భక్తులకు మెరుగైన దర్శనం, సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.