మేడ్చల్ కాలేజీ గంజాయి కేసులో ట్విస్ట్.. జూనియర్లకు అమ్ముతోన్న సీనియర్లు!

7 months ago 11
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలపై మెరుపు దాడులు నిర్వహిస్తూ.. వారి ఆటకటిస్తున్న ఈగిల్ టీమ్.. ఇటీవల మేడ్చల్ పరిధిలో గల ఓ వైద్య కళాశాలలో గంజాయి సేవిస్తున్న విద్యార్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, సీనియర్ విద్యార్థులే.. అక్కడ జూనియర్లకు గంజాయి అమ్మతున్నట్లు విచారణలో గుర్తించారు. హరాఫత్‌ అలీఖాన్‌ అనే ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడగా.. అతడు కర్ణాటకకు చెందిన జరీనా బాను అనే మహిళ నుంచి గంజాయి కొనుగోలు చేసినట్టు తేలింది. దీన్ని విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
Read Entire Article