Ap High Court On Minister Nara Lokesh: ఏపీ విద్యా మంత్రి లోకేశ్ పనితీరును హైకోర్టు ప్రశంసలు కురిపించింది. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులోని కేజీబీవీలో విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటనపై స్పందించిన తీరుపై కితాబిచ్చింది. మంత్రి తక్షణమే స్పందించడంతో.. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా యంత్రాంగమంతా అక్కడికి వెళ్లి విద్యార్థినులను ఆదుకున్నారని గుర్తు చేసింది. అలాగే కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధనాసిబ్బంది జీతాల అంశంతో పాటుగా శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేయడంపై మంత్రి ప్రకటనను తాము చూశామంది.