తల్లికి వందనం పథకం అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. తల్లికి వందనం పథకం నిబంధనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తున్నామని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అలాగే ఇంట్లో పాఠశాలకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఒక్కొక్కరికీ రూ.15 వేలు జమ చేస్తామని స్పష్టం చేశారు.