రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యం అయిన ఈ రోజుల్లో.. ఓ కొత్త సమస్య సమాజాన్ని కలవరపెడుతోంది. అదే మైనర్ల చేతిలో వాహనాలు. వాహనాలు నడిపేందుకు అవసరమైన వయస్సు, అవగాహన లేని చాలా మంది పిల్లలు రోడ్లపైకి వచ్చి యాక్సిడెంట్లకు కారణం అవుతున్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా పిల్లలకు వాహనాలు ఇస్తుండటంతో వారితో పాటు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.