Centre 4285 Crore to Amaravati: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలోనే ఏపీ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల మూడోవారంలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే అమరావతిలో ప్రధాని పర్యటనకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు ముందే రాష్టానికి భారీ శుభవార్త అందింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు విడుదల అయ్యాయి.