భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. 'ఆపరేషన్ సిందూర్'కు మద్దతుగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందన్నారు. 75 ఏళ్లుగా భారత్ పాకిస్తాన్తో బాధలు పడుతోందని.. ఇక ఓపిక లేదని అన్నారు. ప్రపంచ పటం నుండి ఆ దేశాన్ని తుడిచివేయాలని ఆయన ప్రధాని మోదీ కోరారు. సైనికులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.