యాదగిరిగుట్ట ఆలయ నగరంలో మద్యం, మాసం, జంతువధపై నిషేదం అమల్లో ఉండనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయానికి 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టగా.. సభ ఆమోదం పొందింది. గవర్నర్ ఆమోద ముద్ర తర్వాత బోర్డు ఏర్పాటు కానుండగా.. ఆ తర్వాత కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు.