యాదగిరిగుట్ట ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు తుది దశకు చేరుకున్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కాగా.. మరో మూడ్రోజుల్లో పనులు పూర్తి చేయనున్నారు. మెుత్తం 68 కేజీల బంగారంతో స్వర్ణ తాపడం చేయించగా.. ఈనెల 23న గోపురానికి మహా సంప్రోక్షణ చేయనున్నారు. కాగా, తెలంగాణలో బంగారు విమాన గోపురం ఉన్న ఏకైక ఆలయంగా యాదగిరిగుట్ట నిలవనుంది.