యాదగిరిగుట్ట ఆలయంలో రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి డాలర్లు మాయం కావడం కలకలం రేపుతోంది. ఆడిట్ తనిఖీల్లో లెక్కల్లో తేడా బయటపడటంతో అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. సిబ్బంది ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.