యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక అధ్యయనోత్సవాల నేపథ్యంలో నెల 30 నుంచి వచ్చే నెల 4 వరకు నిత్య కైంకర్యాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఆలయం ముస్తాబవుతుండగా.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు.