Yadagirigutta Brahmotsavam: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన అత్యంత వైభవనంగా నిర్వహించే స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకాన్ని హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్కు ఆలయ అర్చకుల బృందం ఇప్పటికే ఆహ్వానాలు అందించారు. అయితే.. యాదగిరిగుట్ట దేవస్థాన గోపురం రికార్డుకెక్కింది. దేశంలో ఎత్తైన స్వర్ణ గోపురంగా యాదగిరిగుట్ట ఆలయ గోపురం నిలవటం విశేషం