యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆలయ సేవలను కొనియాడుతూ అధికారులకు లేఖ రాశారు. ఒట్టావాలో జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రశంసించారు. ఈ గుర్తింపుతో ఆలయం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.