యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సిబ్బంది చేతివాటం మరోసారి బయటపడింది. ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ను పక్కదారి పట్టిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. గతంలో చింతపండును దొంగిలించి ఆలయ సిబ్బంది వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. దేవస్థానం గొడౌన్లోనే దందాకు తెరతీశారు.