యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వామివారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. కళ్లు చెదిరేలా బంగారంతో తయరు చేయించిన స్వర్ణ కవచ శేష, గరుడ వాహనాలు, బర్మా టేకుతో తయారు చేయించిన సేవా పీఠాన్ని ఆలయ అధికారులకు అప్పగించారు. మెుత్తం రూ.28 లక్షల వ్యయంతో వీటిని తయారు చేయించగా.. ప్రస్తుతం జరగుతున్న బ్రహ్సోత్సావాల్లో వీటిని ఉపయోగించనున్నారు.