తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఓ భక్తుడు రూ.4 కోట్ల విలువైన ఆస్తిని విరాళంగా ఇచ్చాడు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు హైదరాబాద్లోని తన మూడంతస్తుల ఇంటిని స్వామివారికి దానం చేశారు. గతంలో మై హోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా 5 కేజీల బంగారం విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.