Yadagirigutta Temple Hikes Vratham Ticket Price: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సత్యనారాయణ వ్రతాల టికెట్ ధరలను రూ.800 నుంచి రూ.1000కి పెంచుతూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన టికెట్పై స్వామివారి శేష వస్త్రాలు, విగ్రహ ప్రతిమ ఇవ్వనున్నారు. భక్తులకు పులిహోర, లడ్డూ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేసేందుకు దేవస్థానం ట్రయల్ నిర్వహించనుంది. హుండీల ద్వారా రూ.4.47 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ సర్కిళ్లకు ప్రత్యేక పేర్లు పెట్టారు.