యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరులో గల ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కంపెనీ భవనం కుప్పకూలింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు, గ్రామస్థులు కంపెనీ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.