యూరియా కోసం రైతుల నిరసన.. పీఏసీఎస్‌లో ఫర్నీచర్ ధ్వంసం

11 months ago 25
విజయనగరం జిల్లాలో యూరియా కోసం రైతులు తన్నుకున్నారు. ఉదయం నుంచి క్యూలైన్‌లో ఉంటే కొందరికి మాత్రమే యూరియా ఇస్తారా అంటూ ఆందోళనకు దిగారు. అన్నదాతల నిరసన ఉధృతంగా మారడంతో యూరియా పంపిణీని అధికారులు నిలిపివేశారు. గజపతినగరం పీఏసీఎస్‌కి యూరియా వస్తుందన్న సమాచారంతో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో రైతులు వచ్చారు. కానీ, స్టాక్ పరిమితంగా ఉండడంతో అందరికీ సరిపడా యూరియా అందదని తెలిసి నిరసన చేశారు.పీఏసీఎస్‌కి కొంతమంది రాజకీయ నాయకులు రావడంతో గందరగోళం ఏర్పడింది. స్థానిక రాజకీయ నాయకులతో ఆధికారులు ములాఖత్ అయ్యారని రైతులు ఆరోపించారు. రైతుల ఆరోపణలతో నిరసన ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పీఏసీఎస్ కార్యాలయంలోకి రైతులు దూసుకెళ్లారు. అక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆఫీసులో ఉన్న కుర్చీలు, ఇతర ఫర్నీచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రైతులు నిరసన తెలిపారు. రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా యూరియా సరఫరా జరగాలని కోరారు.
Read Entire Article