రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ హైవేపై ప్రైవేటు బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.