భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ వేడుకలు నేడు జరనున్నాయి. 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక సభకు 1,213 ఎకరాల విశాలమైన స్థలాన్ని ఎంచుకున్నారు. పార్టీ అంచనా ప్రకారం.. సుమారు 10 లక్షల మంది ప్రజలు ఈ మహాసభకు హాజరయ్యే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (కేసీఆర్) ఈ సభకు హాజరుకానున్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ప్రారంభమైన ఈ పార్టీ, 2022లో బీఆర్ఎస్గా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో.. రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది.