రబీ సీజన్ సన్నద్ధతపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని.. పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని, జిన్నింగ్ మిల్లులన్నీ ప్రారంభించాలని సూచించారు.