ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత పదేళ్లలో రహదారుల వెంబడి సుమారు 90 కొత్త గ్రామాలు ఏర్పడ్డాయి. రవాణా సౌకర్యం, మౌలిక వసతులు మెరుగుపడటం, ముంపు బాధితులకు నష్టపరిహారం రావడంతో ప్రజలు రహదారుల పక్కనే ఇళ్లను నిర్మించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పట్టణాల మాదిరిగానే అన్ని సౌకర్యాలతో ఈ కొత్త నివాస ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో రహదారుల పక్కనే స్థలాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.