రాఖీ పండగ వేళ.. తెలంగాణ పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు. రాఖీ పండగ పేరుతో వచ్చే గ్రీటింగ్స్, ఆఫర్స్ను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి వాటితో సైబర్ నేరగాళ్లు.. ఖాతాలు ఖాళీ చేసేస్తారని హెచ్చరికలు చేశారు. ఇలాంటి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండి.. సైబర్ క్రైమ్ ఉచ్చులో చిక్కుకోవద్దని పేర్కొంటున్నారు. రాఖీ పండగకు సంబంధించి.. ఎలాంటి లింక్లు వచ్చినా క్లిక్ చేయవద్దని.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని.. ప్రజలకు సూచించారు.