రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో మరణం చోటుచేసుకుంది. విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరోవైపు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ విలేకర్ల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. కూలెంట్ లీకేజీనే కల్తీకి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ల్యాబ్ రిపోర్టులు మరో మూడు, నాలుగు రోజులలో వస్తాయని.. అవి వచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందని వివరించారు.