రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మనోహర్ అనే ఆరేళ్ల బాలుడు మంగళనారం కన్నుమూశాడు. విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళనారం మధ్యాహ్నం చనిపోయాడు. కిడ్నీ వైఫల్యం కారణంగానే మనోహర్ చనిపోయినట్లు తెలిసింది. మరోవైపు కల్తీ పాల కారణంగానే తన కొడుకు చనిపోయాడని బాలుడి తల్లి అర్చన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి రోజు నుంచే బాలుడి ఆరోగ్యం దెబ్బతిందని చెప్తున్నారు. మరోవైపు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకూ ఐదుగురు చనిపోయారు.