రాజలింగం హత్య ఘటన రాజకీయ వివాదానికి దారి తీసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసు వేసినందుకు బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య కుట్ర పూరితంగానే జరిగిందన్నారు. ఘటనపై సీఎం సీరియస్గా ఉన్నారని.. దోషుల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.