తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు ఈనెల 14తో ముగుస్తుంది. అయితే పథకానికి అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందక లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో సుమారు 6 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నేటి నుంచి మూడ్రోజులు వరుసగా సెలవులు రావటంతో కార్యాలయాలు పనిచేయకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.