‘రాజీవ్ యువ వికాసం’ పథకం ద్వారా ప్రభుత్వం పేద కుటుంబాల యువతకు ఆర్థిక అండగా నిలవనుంది. వ్యాపార ప్రారంభానికి రూ.50 వేల నుండి నాలుగు లక్షల వరకు రుణ సహాయం అందించనుంది. రుణ మొత్తాన్ని బట్టి 70 నుంచి 100 శాతం వరకు సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ సిబిల్ స్కోర్ సమస్య కారణంగా నిధుల విడుదల నిలిచిపోయింది. ఇప్పటికే రుణ పత్రాలు పొందిన వేలాది మంది యువకులు ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.