Rajiv Yuva Vikasam Scheme First List: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద జూన్ 2న లబ్ధిదారులకు రుణాలు అందజేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తొలి విడతలో లక్ష మందికి లోన్లు మంజూరు చేస్తామని, హైదరాబాద్ నుంచే 9,219 మంది ఎంపికయ్యారని ఆయన వెల్లడించారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను దశలవారీగా అందిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.