రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఆదాయం పెంచుకునేందుకు రెండో విడత వేలానికి సిద్ధమైంది. రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్లను వేలం వేయడం ద్వారా రూ.3,500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఆదాయాన్ని పేద, మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణ పథకాలకు వినియోగించనున్నారు. త్వరలోనే వేలం వివరాలు వెల్లడించనున్నారు.