తెలంగాణ రాజ్భవన్ హార్డ్డిస్క్ల చోరీ కేసులో సంచలనం వెలుగుచూసింది. హై సెక్యూరిటీ జోన్లో జరిగిన ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేయగా, రాజ్భవన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్ హార్డ్డిస్క్లను దొంగిలించినట్లు తేలింది. మహిళా ఉద్యోగి ఫొటోలు మార్ఫింగ్ చేసిన కేసులో సస్పెండ్ అయిన శ్రీనివాస్, బెయిల్పై వచ్చి తన సిస్టమ్లోని అవే ఫొటోలున్న హార్డ్డిస్క్ను తీసుకుపోయాడు. చోరీ చేసిన హార్డ్డిస్క్లలో కీలక సమాచారం లేదని పోలీసులు ధ్రువీకరించారు.