ఇండియా కూటమి నుంచి ఉప-రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీచేశారు. అయితే, ఆయనను విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్ధిగా ఎంపిక చేయడంతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జస్టిస్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు 2011లో ఇచ్చిన తీర్పుపై అమిత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. ఆయన నక్సల్స్ ఉద్యమానికి అనుకూలమని, మావోయిస్ట్ ఉద్యమం ఇంకా కొనసాగడానికి ఆయన ఇచ్చిన తీర్పే కారణమని ఆరోపించారు.