హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి (మార్చి 21న) పూట కురిసిన కుండపోత వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా కరెంట్ లేదు. దీంతో.. రంజాన్ వేళ ఉపవాస దీక్షను అవలంభిస్తున్న ముస్లింలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ యాకుత్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అసెంబ్లీలో ప్రస్తావించారు. చిన్న వర్షానికి రాత్రంతా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఎదురైతే పరిస్థితి ఏంటని ప్రభుత్వా్న్ని నిలదీశారు.