హైదరాబాద్లో వివాహేతర సంబంధం మరో దారుణానికి దారితీసింది. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. నిద్రిస్తున్న భర్తను ప్రియుడితో కలిసి గొంతు నులిమి, డంబెల్తో కొట్టి చంపింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాజంలో నైతిక విలువలు దిగజారుతున్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.