గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అత్త, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్, ఉపాసన కొణిదెల తల్లి శోభనా కామినేని సాహసోపేతమైన సైకిల్ యాత్రతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన 60వ పుట్టినరోజును పురస్కరించుకుని 60 ఏళ్ల వయసులో ఏకంగా 600 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్పై చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి విజయవంతంగా సైక్లింగ్ పూర్తి చేశారు. మోకాలికి ఆపరేషన్ జరిగి, మెడలో ప్లేట్స్ ఉన్నప్పటికీ శోభనా కామినేని ఈ ఛాలెంజ్ను స్వీకరించి తన దృఢ సంకల్పాన్ని చాటుకున్నారు. 2020 డిసెంబర్లో ఆమె ఈ సాహసయాత్ర పూర్తి చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.