రాయలసీమ రైతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా రూ. 40 వేల కోట్లతో కూటమి ప్రభుత్వం కీలక కార్యాచరణ చేపట్టింది. 'పూర్వోదయ పథకం' నిధులు ఉపయోగించుకుని.. రాయలసీమంతో పాటు ప్రకాశం జిల్లాలోని 92 క్లస్టర్లలో జీవనోపాధి కల్పించడంతో పాటు, రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు నిర్మించనున్నారు. రాయలసీమను ఉద్యాన పంటల హబ్గా తీర్చిదిద్దే లక్ష్యం ముందుకు సాగాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. డిమాండ్ ఉన్న పంటలపై రైతులకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు.