నంద్యాల జిల్లాలో హంద్రీనీవా నీటిని విడుదల చేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చిన సంతృప్తిని ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన అన్నారు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, ఆగస్టు 15 నుంచి వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తామని తెలిపారు. రాయలసీమ ప్రజల కష్టాలు తనకు తెలుసని, తాను ఇక్కడే పుట్టి పెరిగానని గుర్తు చేసుకున్నారు.