హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పలు ప్రభుత్వ శాఖల పనులు నిలిచిపోయాయి. ఉదయం నుంచి సేవలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోవడం వల్ల తరచుగా ఇలాంటి అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీనితో ఇంట్లో నుంచి పని చేసే వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అయితే.. ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోవడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.