మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా జీబీఎస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. వందకు పైగా జీబీఎస్ కొత్త కేసులు నమోదు కాగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళ హైదరాబాద్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.