IAS Officers Transferred in Telangana: తెలంగాణ ప్రభుత్వం గురువారం రాత్రి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సీనియర్ అధికారి జయేశ్ రంజన్తో పాటు పలువురికి అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీలో జోన్ల సంఖ్యను 12కు పెంచి, 12 మంది జోనల్ కమిషనర్లను నియమించారు. పలువురు కలెక్టర్లు, ఇతర కీలక పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సిరిసిల్ల కలెర్టక్ హరితకు టీజీపీఎస్సీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.