తెలంగాణలో రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు చేశారు. అత్యధికంగా 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.